అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
కడప : నిత్యావసర సరుకులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ లవన్న తెలిపారు ఆదివారం కడప నగరంలోని పలు సూపర్ మార్కెట్లలో ఆయన నగరంలో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికంగా అమ్మకాలు చేపడుతున్న వివిధ సరుకుల ధరలను ఆయన పరిశీలించారు సరుకుల ధరలపై స్థానిక వినియోగదారులను ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వాహకులు తప్పనిసరిగా కరోనా నివారణ చర్యలను పాటించాలని అందుకు అవసరమైన ఏర్పాట్లను చేపట్టాలన్నారు. ముఖ్యంగా వినియోగదారులు సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
The following two tabs change content below.
Kadapa News Online
- కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోండి - May 9, 2020
- కంటైన్మెంట్ జోన్లలో.. ప్రత్యేక దృష్టి సారించాలి - May 6, 2020
- కార్మికుల త్యాగాలకు ప్రతీక మేడే - May 1, 2020