పారిశుధ్య కార్మికుల సేవలు అద్భుతం
కడప : పారిశుద్ధ కార్మికుల సేవలు అమోఘమని లాక్ డౌన్ సందర్భంగా గత 22 రోజుల నుంచి పారిశుద్ధ్య కార్మికులు జిల్లాలో మెరుగైన పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి. అంజాద్ భాష పేర్కొన్నారు. ఆదివారం ఉప ముఖ్యమంత్రి వర్యులు పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఎస్ బి. అంజాద్ బాషా మాట్లాడుతూ.. కరోనా నివారణకు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యమన్నారు పట్టణంలోని పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజు వీధి వీధి తిరిగి చెత్తాచెదారం ఎత్తివేస్తూ, డ్రైనేజీ కాలువలు శుభ్రపరుస్తూ రోడ్డుకిరువైపులా బ్లీచింగ్ పౌడర్ చల్లి వీధులను సుబ్ర పరుస్తున్నారన్నారు. ఇళ్లలోని చెత్తను రోడ్లపైన వేయకుండా మునిసిపాలిటీ వారి చెత్త కుండీలలో వేయాలన్నారు. కరోనా వైరస్ నివారణకు పరిశుభ్రత ఎంతో ముఖ్య మని ఎక్కడైనా చెత్తాచెదారం అధికంగా ఉన్నట్లయితే వెంటనే మునిసిపాలిటీ వారికి తెలియజేయాలన్నారు. పారిశుధ్య కార్మికులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కరోనా వైరస్ ను లెక్కచేయకుండా వీధులను శుభ్ర పరచడం ప్రతి ఒక్కరు హర్షించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 8వ డివిజన్ ఇంచార్జి షేక్ ఆరిఫుల్ల భాష, మున్సిపల్ సిబ్బంది
Kadapa News Online
- కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోండి - May 9, 2020
- కంటైన్మెంట్ జోన్లలో.. ప్రత్యేక దృష్టి సారించాలి - May 6, 2020
- కార్మికుల త్యాగాలకు ప్రతీక మేడే - May 1, 2020