స్టేట్ బ్యాంకు ఆధ్వర్యంలో భోజన ప్యాకెట్లు పంపిణీ
ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాత్రనకా పగలనకా తేడాలేకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి ప్రొద్దుటూరు మెయిన్ బ్రాంచ్ భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో కడప శాఖ రీజినల్ మేనేజర్ ఆర్ సందీప్ నంబియార్, స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ ఎస్సై వారి సమక్షంలో 120 పోలీస్ సిబ్బందికి భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం పట్టణంలోని విజయేశ్వరి వృద్ధాశ్రమం నందు 70 మందికి , మదర్ తెరిసా వృద్ధాశ్రమం నందు 5 0 మందికి భోజన ప్యాకెట్లను, పండ్లను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కడప శాఖ భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ ఆర్ సందీప్ నంబియార్, చీఫ్ మేనేజర్ టి వేంకటేశ్వర రావు, స్థానిక చీఫ్ మేనేజర్ ఇ-వెంకటసుబ్బయ్య బ్యాంకు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Source : Manam News
Kade Pavan Kumar Yadav
Latest posts by Kade Pavan Kumar Yadav (see all)
- గండికోటలో తగ్గుతున్న నీటిమట్టం - April 12, 2020
- నాటుసారా స్థావరాలపై దాడి - April 12, 2020
- ఈనెల 15 నుంచి రేషన్ సరుకులు పంపిణీ - April 12, 2020